క్వింటాకు 42 వేల రూపాయలు పలికిన ‘సింగిల్ పట్టి’ మిర్చి

తెలంగాణాలోని ములుగు జిల్లా పొట్లాపూర్ గ్రామానికి చెందిన కె. లింగమూర్తి అనే రైతు 7 బస్తాల సింగిల్ పట్టి మిర్చి ఎనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా.. క్వింటాకు రూ.42 వేల ధర వచ్చింది. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ రకం మిర్చి తక్కువ కారం ఉండి.. మంచి రంగు ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Read More

పంటల సాగుకు అందించే రుణ పరిమితి పెంపు

వివిధ రకాల పంటల రుణాల పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలు, అగ్రి, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ సమావేశమై 127 రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి సిఫార్సులు చేయగా.. రుణ పరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించింది.


వరి – రూ.48 వేలు, పత్తి – రూ.52 వేలు, మొక్కజొన్న – రూ.38 వేలు,
వేరుశనగ – రూ.34 వేలు, మిర్చి – 90 వేలు, చెరకు – 84 వేలు.

Read More

తెలంగాణలో మద్దతు ధరతో పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగయిన శనగ, మినుములు, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తులను మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్‌లో మాట్లాడగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 1.25 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనాలని. దీనికి సుమారు రూ. 894 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. కేంద్రం ఆమోదం లభించడంతో రాష్ట్రంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Read More

టమాటా ధర లేక ఉచిత పంపిణీ

టమాటాను అమ్ముకోలేక రైతులు ఉచితంగా పంపిణీ చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో గూడూరు మండలం భూపతి పేటకు చెందిన పోగుల కొండ సారయ్య, మోహన్, సురేందర్ శుక్రవారం కొత్తగూడ సంతలో టమాటాని విక్రయానికి తీసుకొచ్ౘ్ారు. చిరువ్యాపారులకు ఇరవై కిలోల పెట్టెను రూ.100కు విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీసం రూ.50కి కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మహిళలందరికీ ఉచితంగా పంపిణీ చేశారు.

Read More