రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More

వేగం పెంచిన రుతుపవనాలు

24నే కేరళకు.. 26 నాటికి రాయలసీమకు!
నెలాఖరుతో వేసవి ముగిసినట్లే: నిపుణులు

నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం (జూన్‌ 1) కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సాధారణం కంటే ఐదు రోజులు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి వేసవి దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా, తర్వాత మరింత బలపడుతుందని అంచనా. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయి.

Read More