తుపాన్లను తట్టుకునే వరి రకం

ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు పరిశోధన కేంద్రం ఎంటీయూ 1318 రకాన్ని విడుదల చేసి 2020లో మినీ కిట్లు ఇచ్చి రైతులతో సాగుచేయించగా మంచి ఫలితాలు వచ్చాయి ఈ రకాన్ని 2022 నుంచి సాగుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తుపాన్లను తట్టుకుని దీటుగా నిలబడి మంచి దిగుబడులు ఇస్తుండటంతో గత ఖరీఫ్ లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు సుమారు 6 లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1318 రకం సాగైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం పెనికేరులో తుపానుకు పడిపోయిన స్వర్ణ రకం వరి. పక్కనే నేలవాలకుండా నిలబడిన ఎంటీయూ 1318 రకం మొంథాను తట్టుకుని…. ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వరిపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. కనీసం ఎకరాకు 15-20 బస్తాల దిగుబడికి నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని స్వర్ణ స్థానంలో ఇతర రకాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంటీయూ 1318ని.. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. మొంథా తీవ్ర అలజడి సృష్టించినా 90% పంట పడిపోకుండా నిలబడింది. రెండేళ్ల సగటును పరిశీలిస్తే ఎకరాకు 35-40 బస్తాల దిగుబడి వస్తుంది. వర్షాలకు పంట నేలవాలలేదు.
ఎకరాకు 4-5 బస్తాల అధిక దిగుబడి

  • పాలడుగు సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు, ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    మార్టేరు పరిశోధన కేంద్రంలో పనిచేసినప్పుడు ఎంటీయూ 1318ని రూపొందించా. స్వర్ణ రకాన్ని ఎంటీయూ 1064(అమర)తో సంకరపరిచి అభివృద్ధి చేసిన విత్తనమిది. 150-155 రోజుల వ్యవధిలో దిగుబడినిచ్చే ఈ రకం.. కాండం దృఢంగా ఉండటం వల్ల తుపాన్లకు నేల వాలదు. దోమపోటు, ఎండాకు, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. స్వర్ణతో పోలిస్తే ఎకరాకు 4-5 బస్తాల దిగుబడిని అదనంగా ఇస్తుంది.
Read More

ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.

Read More