లక్ష ఎకరాలకు సాగు నీరు అందించగల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు

తెలంగాణాలోని నారాయణపేట- కొడంగల్ సాగునీటి ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎలఐఎస్) కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎసఈఐ ఏఏ) పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టు ప్రభావిత రెండు మండలాల్లో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాయి. వీటి నివేదికలను ఎసఈఐఏఏకు అందజేయగా ఆ సంస్థ మదింపు చేసి.. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపింది.
ఈ ఎత్తిపోతల పథకం కింద నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 10 మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రూ.4,885 కోట్లతో మూడు దశల్లో జూరాల నుంచి 7 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. పది జలాశయాల్లో 4 టీఎంసీలు నిల్వ చేస్తారు. దారి మధ్యలోని 123 గ్రామాలకు తాగునీరు అందిస్తారు.
ప్రాజెక్టు నిర్మాణాల వెంట రూ.3.92 కోట్లతో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తారు. 55.85 హెక్టార్లలో 54,500 మొక్కలు పెంచుతారు.

Read More

రూ.2.84 కోట్లు పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ పనులకు

ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టులో డీజిల్ జనరేటర్ సెట్ల ఏర్పాటు, కుడివైపున ప్యానెల్ కంట్రోల్ గదిలో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు, ఇతర నిర్వహణ పనులకు రూ.2.84 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Read More

పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటి విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆదివారం కృష్ణా జలాలను బనకచర్లకు విడుదల చేసేందుకు వచ్చిన మంత్రి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నాం అని వెల్లడించారు. దెబ్బతిన్న అలగనూరు రిజర్వాయర్‌ బండ్‌, గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు పూజలు చేశారు. 10 వేల క్యూసెక్కుల శ్రీశైలం వెనుక జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బనకచర్లకు విడుదల చేశారు. కృష్ణమ్మకు చీరె, సారె సమర్పించి జలహారతినిచ్చారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖరరెడ్డి, ఈఈ నాగేంద్రప్రసాద్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు

Read More