అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయల విత్తనోత్పత్తి

అధిక దిగుబడులు ఇచ్చే కూరగాయల విత్తనాల ఉత్పత్తిని తతెలంగాణా రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్నట్లు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా కూరగాయ పంటల్లో ఈ విత్తనోత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పరిశోధన, విస్తరణ మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. సాంకేతికత, ఆధునికత, యాంత్రీకరణ ద్వారా కూరగాయల సాగుకు ఊతమిస్తున్నాం. జీవ ఎరువులు, పురుగు మందుల లభ్యత పెంచుతాం. పంట నష్టాలను నివారించేందుకు వాతావరణ ఆధారిత ఉద్యాన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తాం” అని రాజిరెడ్డి తెలిపారు.

Read More

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More