గోసంరక్షణకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది

తెలంగాణా రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ ఆదివారం శాసనమండలి హాలులో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, జీహెచఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్, నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీకి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read More

రాజస్థాన్‌లో ఆవులకు గోపాష్టమి పూజలు

రాజస్థాన్‌ పశుసంసవర్ధక శాఖతోపాటు గోధామం నిర్వాహకులు స్వామి రాజేంద్రదాస్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని డీగ్‌ జిల్లాలో గల శ్రీ జడ్‌ఖోర్‌ గోధామంలో బుధవారం గోపాష్టమి పూజలు మొదలయ్యాయి. సూర్యోదయంతో గంటల మోతలు, శంఖ నాదాలు, ఆవుల అరుపులతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందంగా అలంకరించిన గోశాల వద్ద భక్తులు హారతి పళ్లేలతో ‘జై గోమాత’, ‘జై గోపాల్‌’ అంటూ నినదించారు. గోధామంలోని 10 వేల ఆవులకు ఏక కాలంలో పూజలు జరిగాయి. ఇందులో 9 వేల గోవులు స్మగ్లర్ల నుంచి రక్షించి గోధామంలో ఆశ్రయం కల్పించినవి కావడం విశేషం. పవిత్ర గోమాత ‘సురభి’ దర్శనంతో మొదలైన వేడుకల్లో భక్తులు వేలాది ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోరక్షా సంకల్పం పేరుతో అందరూ ప్రమాణం చేశారు.

Read More