గోసంరక్షణకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది
తెలంగాణా రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని, సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ ఆదివారం శాసనమండలి హాలులో రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, జీహెచఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్, నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీకి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


