అన్నదాతా సుఖీభవ మరియు పీఎం కిసాన్‌ నిధులు ఆగస్టు 2న విడుదల

ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.

Read More

మన రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు

మన రైతులకు నీళ్ళిస్తే బంగారం పండిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్ని శరవేగంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్‌-2 పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గురువారం హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ”నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేస్తే కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 33 లక్షల మందికి తాగు నీరు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో నెరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం” అని వివరించారు.

Read More

అమరావతిలో 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం

హాజరై మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని గ్రామం అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ శాఖ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్కులో 1,000 మొక్కలు నాటనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో సుమారు 1,500 మంది పాల్గొనే అవకాశం ఉంది. పార్కు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాల్లో 15 ఎకరాలను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో శరవేగంగా నేలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి హిమ శైలజ, సీఎఫ్‌వో కాశీవిశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
  • 1
  • 2