ఆంధ్రప్రదేశ్‌కు 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం

ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని.. ఎవరూ అందోళన పడొద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వివరించారు. యూరియా కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లోని రైతులకు వెంటనే దీన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 6న గంగవరం పోర్టుకు 15,000 టన్నులు, సెప్టెంబరు రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30,000 టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.10 లక్షల టన్నుల బఫర్‌ నిల్వలు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Read More

అన్నదాతా సుఖీభవ మరియు పీఎం కిసాన్‌ నిధులు ఆగస్టు 2న విడుదల

ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.

Read More