నాణ్యమైన విత్తనముతోనే అధిక దిగుబడులు మరియు విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నాణ్యమైన విత్తనంలో మంచి దిగుబడికి తోడ్పడే అన్ని లక్షణాలు ఇమిడి ఉంటాయి. అందుచేత విత్తన నాణ్యతపై దిగుబడి ఆధారపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇతర వ్యవసాయ ఉత్పాదకాలతో పాటు నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల అధిక లాభాలు పొందుతారు. కావున రైతులు నాణ్యమైన విత్తనము లక్షణాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది.
నాణ్యమైన విత్తనంకి ఉండాల్సిన లక్షణాలు:
శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి పరిచే వంగడాలు ఎంతో మెరుగైనవి కావున వాటి నాణ్యతా ప్రమాణాలు కూడా ఖచ్చితంగా ఉంటే వాటిని రైతులు పూర్తి స్థాయిలో వినియోగిం చుకున్నవారవుతారు.
జన్యుస్వచ్ఛత:
ఒక రకం విత్తనం ఉపయోగించి అదే రకమైన విత్తనం పొందగలిగితే అది జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనంగా గుర్తించవచ్చు లేదా శాస్త్రవేత్తలు ఏవైతే లక్షణాలను వాటిలో ప్రవేశపెడ తారో అవే లక్షణాలు సంపూర్ణంగా ఆ విత్తనం కలిగి ఉంటే అది జన్యుపరంగా స్వచ్ఛమైందిగా చెప్పవచ్చు.

జన్యుస్వచ్ఛత ఆధారంగా విత్తనాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి…
(1) బ్రీడరు సీడ్ : నూరు శాతం జన్యుస్వచ్ఛత కలిగి ఉన్న విత్తనం శాస్త్రవేత్తలు ఏవైతే రకాలను ఉత్పత్తి చేస్తారో వాటి నుంచి లభించిన అత్యంత స్వచ్ఛమైన విత్తనమే ఈ బ్రీడరు సీడ్ ఈ విత్తనం ఖచ్చితంగా శాస్త్రవేత్త లేదా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసినదై ఉంటుంది. దీనిని బంగారు పసుపు రంగు లేబుల్/ట్యాగ్ తో గుర్తిస్తారు.
(2) ఫౌండేషన్ సీడ్ : బ్రీడరు సీడు నుంచి ఉత్పత్తి చేసిన రెండో తరం విత్తనం కాబట్టి దీని జన్యుస్వచ్ఛత 98 శాతం పైనే ఉంటుంది, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో దీనిని ఉత్పత్తి చేసి, తెలుపు రంగు ట్యాగ్ తో గుర్తిస్తారు. దీనిని విత్తనోత్పత్తి చేపట్టే రైతులకు అందజేస్తారు.
(3) సర్టిఫైడ్ సీడ్ : రైతులు పంటలు పండించడానికి ఉపయోగించుకునే విత్తనమే సర్టిఫైడ్ సీడ్. ఫౌండేషన్ సీడ్ నుంచి విత్తనోత్పత్తి చేసే రైతులతోగానీ, ప్రైవేటు విత్తనోత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన మూడోతరం విత్తనం. దీని జన్యుస్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. విత్తన ధృవీకరణ సంస్థ వారు విత్తనోత్పత్తిదారుల క్షేత్రాలను తనిఖీ చేసి దీనిని ధృవీకరిస్తారు. నీలి రంగు ట్యాగ్ ద్వారా దీనిని గుర్తించాలి.
4) ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్: దాదాపుగా రైతులు వినియోగించుకునే విత్తనం ఇది. కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే తమ విత్తనాలను ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తి చేస్తాయి. వాటిని సర్టిఫైడ్ సీడ్ అని అంటాం. కానీ దాదాపుగా ప్రైవేటు విత్తనోత్పత్తి దారులు తమ స్వంత బాధ్యత వహించి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే ట్రూత్ ఫుల్ లేబుల్ సీడ్ అని అంటారు. రైతు ఆయా ఉత్పత్తిదారులపై నమ్మకంతోనే వీటిని కొనాల్సి ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగు ట్యాగు కలిగి ఉంటుంది.
భౌతిక స్వచ్ఛత: ఎంపిక చేసుకున్నవంగడం (రకం) అదే రకమైన విత్తనాన్ని కలిగి ఉండి తాలు గింజలు, మట్టి పెళ్లలు, దుమ్ము, ధూళి, కలుపు గింజలు, ఇతర రకాల విత్తనాలు (గింజలు) లేకుండా ఉంటే ఆ విత్తనం భౌతిక స్వచ్ఛత కలిగి ఉన్నట్లుగా చెప్ప వచ్చు అన్ని పంటల్లో భౌతిక స్వచ్ఛత 98 శాతంగా ఉండాలి. అంటే ఒక రకం విత్తనం ఎంపిక చేసుకుంటే నూరు విత్తనాలకు కనీసం 98 విత్తనాలు అదే రకానికి చెందినవై ఉండాలి.
సర్టిఫైడ్ సీడ్లలో జన్యుస్వచ్ఛతః
సర్టిఫైడ్ జన్యుస్వచ్ఛత (%)
సూటిరకాలు 98
సంకర రకాలు 95
పత్తి, వంకాయ, టొమాటో సంకర రకాలు 90
ఆముదం (సంకర రకాలు) 85
మొలక శాతం: మొలక శాతం అధికంగా ఉంటే అది నాణ్యమైన విత్తనంగా చెప్పవచ్చు. విత్తనం వేసిన తర్వాత వచ్చే మొలకల ఆధారంగా మొలక శాతం లెక్కించబడుతుంది. మొలక శాతంపైనే మొక్కల సాంద్రత ఆధారపడి ఉంటుంది. పంటలను బట్టి కనీసం 70-90 మొలకశాతం ఉండేలా చూడాలి.
పంట మొలకశాతం (%)
మొక్కజొన్న 90
వరి, గోధుమ 80
జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర 75
వేరుసెనగ, ఆముదం, పొద్దుతిరుగుడు 70
సాధారణంగా విత్తనం ఉత్పత్తయిన 9 నెలల నుంచి మొలక శాతం తగ్గు తుంది. రైతులు విత్తనం కొనేముందు. విత్తన తయారీ తేదీని పరిశీలించి 9-12 నెలలు దాటకుండా చూసుకోవాలి.
రైతుస్థాయిలో మొలక శాతం కనుగొనే పద్ధతి:
తక్కువ ఖరీదున్న విత్తనాలైతే 200 చొప్పున, బాగా ఖరీదైన విత్తనాలైతే 50-100 చొప్పున రెండు దఫాలుగా లెక్కించి పక్కన పెట్టుకోవాలి. ఏదై నా దినపత్రికను రెండు పొరలుగా మడిచి నీళ్ళతో తడపాలి. ఇలా తడి పిన పేపరుపై లెక్కించిన విత్తనాలను సమానంగా పరచాలి. దీనిపై మరొక తడి పేపరు కప్పి చాపమాదిరిగా చుట్టి దారంతో రెండువైపులా కట్టాలి. దీనిని ఏటవాలుగా ఒక ట్రేలో పెట్టి తడి ఆరకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా వారం రోజులు ఉంచిన తరువాత, పేపరు జాగ్రత్తగా విప్పి, వేరు, కాండం సమా నంగా ఉన్న మొలకలు మాత్రమే లెక్కించాలి. వేర్లు మరీ పొట్టిగా ఉండి కాండం పొడవుగా ఉన్నా లేదా కాండం బాగా పొట్టిగా ఉండి వేర్లు పొడవుగా ఉన్నా వాటిని లెక్కించ రాదు. ఉదాహరణకు 100 విత్తనా లకు 80 విత్తనాలు మొలకెత్తితే 80 మొలక శాతం ఉన్నట్లు.
తేమశాతం: విత్తనానికి తగినంత తేమ అందితే అది మొలకెత్తుతుంది. తేమ శాతం మరీ ఎక్కువగా ఉంటే విత్తనం నిల్వకాలం బాగా తగ్గిపోయి, కుళ్ళిపోయే అవకాశముంటుంది. ఎక్కువ కాలం విత్తనాన్ని నిల్వ చేసు కోవాలంటే తేమ శాతం ఎంత తక్కు వగా ఉంటే అంత మంచిది, వరి, మొక్కజొన్న, సజ్జ మొదలగు ఆహార పంటల్లో 10-12 శాతం, నూనెగింజలు, అపరాల విత్తనాల్లో 9-10 శాతం, కూరగాయ విత్తనాల్లో 7-8 శాతంగా ఉండాలి. అన్ని రకాల విత్తనాల్లో తేమ 14 శాతానికి మించరాదు.
విత్తనం కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వీలైనంత వరకు ధృవీకరించిన (సర్టిఫైడ్ సీడ్) విత్తనాన్నే రైతులు కొనుగోలు చేయాలి.
- ట్రూత్ ఫుల్ లేబుల్ ఉన్న విత్తనా లను కొనాలనుకుంటే లేబుల్ ను పరిశీలించి జన్యుస్వచ్ఛత, మొలక శాతం, భౌతిక స్వచ్ఛత వంటి వివరా లను క్షుణ్ణంగా పరిశీలించాకే కొనాలి.
- లాట్ నెంబరు, విత్తనం ఉత్పత్త యిన తేదిని చూసుకోవాలి.
- లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనం కొనాలి.
- డీలర్ల వద్దనుంచి బిల్లును తీసుకో వడం తప్పనిసరి, తరువాత మొలక /శాతం తగ్గినా, కల్తీ ఉన్నట్లు అనిపించినా, ఆ బిల్లు ఆధారంగా సమీపం లోని వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
- ధృవీకరించిన సూటి రకాల విత్త నాలను ఒకసారి కొనుగోలు చేసిన తరువాత (మూడేళ్ళ పాటు) రైతులు మెరుగైన మొక్కల నుంచి సేకరిం చిన విత్తనాలను నిల్వ చేసుకొని మూడేళ్ల పాటు ఉపయోగించుకోవచ్చు అదే సంకర రకాలైతే ప్రతీసారి మారుస్తూ ఉండాలి.
N. స్వప్న (7816076871), Ch. ప్రగతి కుమారి, టి. చైతన్య, Dr. స్వర్ణలత, కె. కవిత, Dr. వి.అనిత, వ్యవసాయ కళాశాల, పాలెం.
















