యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

నెల రోజులపాటు పాలేకర్‌ సాగు విధానంపై అవగాహన

సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్పీకే) విధానంలో పంటలు సాగు చేయాలనే ఔత్సాహికులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయనున్నట్లు సేవ్‌ సంస్థ ప్రతినిధి విజయరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి నలుగురు ప్రతి నిధులు సెప్టెంబరు 2న హైదరాబాద్‌ దోమలగూడలోని శ్రీరామచంద్రమిషన్‌లో ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు, యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు వంటి వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

Read More