అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం
రైతు రుణమాఫీ గురించి ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలలో రెండులక్షల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇకపోతే రైతుబంధు విషయంలో ప్రజలకు ఇప్పటికీ అపోహలు ఉన్నాయి కాబట్టి పంటలు సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికీ రైతుబంధు పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేశారు.






