అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం

రైతు రుణమాఫీ గురించి ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలలో రెండులక్షల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇకపోతే రైతుబంధు విషయంలో ప్రజలకు ఇప్పటికీ అపోహలు ఉన్నాయి కాబట్టి పంటలు సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికీ రైతుబంధు పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేశారు.

Read More

24 గంటల్లో లక్షన్నర లోపు రుణమాఫీ

మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో విడతలో భాగంగా జులై 30వ తేదీనాడు లక్షన్నర రూపాయలలోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు 2వ విడత రుణమాఫీని తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేపు ఏర్పాటుచేసే రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు.

Read More

రేపే రూ. లక్ష లోపు రుణమాఫీ

3 దఫాలుగా రుణమాఫీ చేయాలని ఈ రోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి అన్నారు. లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలను రేపు (గురువారం) సాయంత్రం 4:00 గం.ల లోపు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇందుకుగాను 7 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమచేయనున్నట్లు చెప్పారు. జులై నెలాఖరులోగా లక్షన్నర రూపాయల రుణమాఫీ, ఆగస్టులో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Read More

భూమి పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ అమలు.. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు

రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

Read More

తెలంగాణా బడ్జెట్‌లో వ్యవసాయానికే అగ్రతాంబూలం!

ఎన్నడూలేని విధంగా తెలంగాణా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో 60 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికే కేటయించడానికి రెడీ అవుతున్నది. ఈ సొమ్మును ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి, పంటల బీమాకు పెద్ద పీట వెయ్యడానికి, రైతు బీమాకు సంబంధించి ప్రీమియం బాధ్యత సర్కారు వహించడానికి, ఉద్యాన పంటల సాగులో కొత్త ఊపును తేవడానికి కేటాయించడానికి సిద్ధం అవుతున్నారు. వీటన్నింటితో పాటు పామాయల్‌ సాగు కోసం వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం కూడా జరిగింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ తన ప్రాధాన్యతలను ఆర్థిక శాఖకు తెలియచేయడం జరిగింది.

Read More

కొత్త అప్పులకు రుణమాఫీ వర్తించదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం 11-12-2018 నుంచి 9-12-2023 మధ్య తీసుకున్న అప్పులకే రుణమాఫీ వస్తుందని తెలంగాణ రైతుసంఘం ఉపాధ్యకక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కాబట్టి బ్యాంకర్లు రైతులను అప్పులు చెల్లించాలని, రెన్యూవల్‌ చేసుకోవాలని, బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసుకోవాలని రైతులపై వత్తిడి తేవద్దు అని బ్యాంకర్లకు మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 లోపు ఏ ఒక్క రైతూ బ్యాంకు రుణాలను చెల్లించవద్దు. ఒకవేళ చెల్లించి మరలా రుణం తీసుకుంటే అవి కొత్త రుణాలుగా మారతాయి. కాబట్టి కొత్త రుణాలకు రుణమాఫీ వర్తించదు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు పెట్టే ఒత్తిడిని పట్టించుకోవద్దని మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

Read More