పెరుగుతున్న మిరప ధరలు

ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. వరంగల్ ప్రాంతంలో సాగయ్యే ఎల్లో మిర్చి (స్నాక్స్ తయారీలో వినియోగించే కారం) రకానికి రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 44 వేలు ధర పలుకుతోంది. వండర్ హాట్ రకానికి గత వారంతో పోలిస్తే ఇప్పటికి రూ.5 వేలు పెరిగి బుధవారం క్వింటా రూ.30 వేలు పలికింది. అత్యధికంగా సాగయ్యే తేజ రకం రెండు వారాల క్రితం రూ.15 వేలు పలకగా, ఇప్పుడు రూ.20,200 పలుకుతోంది. 341 రకానికి రూ. 25,600, దీపిక రకానికి రూ.26,200 ధర నడుస్తోంది.

Read More

పెరిగిన తమలపాకుల ధర

వంద పంతాల తమలపాకుల ధర రూ.7 వేలకు ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో రూ.2,500 నుంచి రూ.3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం (కట్టకు 170-180 ఆకులు) రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాల్లో సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, మహారాష్ట్ర, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. ఇటీవలి తుపాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడులపై ప్రభావం పడింది. గతంలో ఎకరాకు 3 వేల పంతాల లోపు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 800 నుంచి 1200 లోపు మాత్రమే వస్తుండటం.. ధర పెరుగుదలకు దోహదపడిందని రైతులు చెబుతున్నారు. ధర పెరగడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.

Read More