ప్రత్యామాయ పంటల సాగుకు ప్రభుత్వం అండ
ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని, ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల పరిధిలో 15 లక్షల హెక్టార్లలో పంట మార్పిడికి ప్రణాళిక తయారు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘వరి లోనూ కొత్త రకం సాగును ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కోరే రకాలకే రాయితీ వర్తింప చేయనున్నాం. 9.13 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సి కార్డులిచ్చి రూ. 4,474 కోట్లు రుణాలిచ్చాము. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. పంటల మార్పిడిలో భాగంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులకు అండగా నిలిచేలా రూ.2,400 మద్దతు ధర ప్రకటించాం. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.


