రైతు వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 9 వరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రైతువారోత్సవాలను వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన, రెండో రోజు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజీలు, రుణ సదుపాయాలపై అవగాహన, నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌర శక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఐదో రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖలు.. పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై, చివరి రోజు సాగునీటిశాఖ.. వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు.

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీకి అనుమతి

గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని ఈ ఏడాదీ అమలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26 సంవత్సరానికి 90 కోట్ల చేపపిల్లలను రూ. 122 కోట్లతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆదేశించింది. నెలాఖరు వరకు టెండర్లు పిలిచి వచ్చేనెల 15 నాటికి వాటిని ఖరారు చేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Read More