పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.