ఉద్యాన పంటల అభివృద్ధికి మారుత్‌ డ్రోన్స్‌తో హార్టికల్చర్‌ వర్సిటీ ఒప్పందం

ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధన, శిక్షణకు అవసరమయ్యే సహకారం కోసం హైదరాబాద్‌కు చెందిన మారుత్‌ డ్రోన్స్‌ సంస్థతో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ దండా రాజి రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ భగవాన్‌, మారుత్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకుడు ప్రేమకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. డ్రోన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తెగుళ్లను అంచనా వేస్తూ పంటల సాగు పద్ధతులను మెరుగుపరుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు చీనానాయక్‌, లక్ష్మీనారాయణ, సురేష్‌కుమార్‌, శ్రీనివాసన్‌, వీణ జోషి తదితరులు పాల్గొన్నారు.

Read More

సీనియర్‌ అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ సందర్శన

న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలోని యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సీనియర్‌ అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ ఈరోజు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ మరియు డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాగు పద్ధతులు, విశ్వవిద్యాలయం చేస్తున్న బోధన, పరిశోధన, విస్తరణ తదితర అంశాల గురించి చర్చించారు. వాతావరణ మార్పులు దాని ప్రభావాలను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించవలసిన ప్రణాళికలు విస్తృతంగా చర్చించారు.

Read More