పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్‌ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు వివరించారు.

Read More

‘ఈ-పంట’ నమోదు సక్రమంగా జరగాలి

ఈ-పంట డిజిటల్‌ సర్వేలో.. విస్తీర్ణం, పంటలు సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 2025 ఖరీఫ్‌ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూముల్ని తొలగించి.. సాగుకు అనుకూలమైన వాటి వివరాలనే ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో జరిగే డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు అనుసంధానించామని పేర్కొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి కాదని వివరించారు.

Read More