జీలుగ బెల్లం, నీరా తయారీకి ప్రోత్సాహంజీలుగ బెల్లం, నీరా తయారీని ప్రోత్సహించి అరకు కాఫీ మాదిరిగా గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టరు వెంగయ్య తెలిపారు. హెచ్‌ఐర్‌ ఎస్‌ శాస్త్రవేత్తలు, డాక్టరు వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టరు మధుమతితో జీలుగ నీరా, బెల్లం తయారీపై గురువారం అమరావతిలో సీఎం సమీక్ష జరిపారు.