వరి కంటే ఆ పంటలే లాభదాయకం

జనరల్‌ నేచర్‌ అధ్యయనంలో వెల్లడి

వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.

Read More

చిరుధాన్యాలు ఊరూరా సాగవ్వాలి.. ఇంటింటికీ చేరాలి ఐఐఎంఆర్‌ వ్యవస్థాపక దినోత్సవంలో డైరెక్టర్‌ తారాసత్యవతి

ఊరూరా చిరుధాన్యాలు సాగు కావాలని.. ఇంటింటికీ వాటి ఆహారం చేరాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ సి. తారాసత్యవతి ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు చిరుధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించి వినియోగించాలన్నారు. ఐఐఎంఆర్‌ పదో వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం రాజేంద్రనగర్‌లోని సంస్థ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”రైతులు పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు చేపట్టి వాటికి పూర్వవైభవం తీసుకురావాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సాహం అందించాలి. ఐఐఎంఆర్‌ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. సాగు విస్తరణతోపాటు ఆహార శుద్ధి, వినియోగం, ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఏపీ, తెలంగాణతోపాటు మరో అయిదు రాష్ట్రాల రైతులతో కిసాన్‌ మేళా నిర్వహిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో సాగు ప్రణాళికలను వెల్లడిస్తాం” అని తారాసత్యవతి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, నార్మ్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఆర్సీ అగర్వాల్‌ మాట్లాడుతూ.. చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. వీటిపై అంకురాల ద్వారా విస్తృత ప్రయోగాలు జరగాలన్నారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు ఫౌండేషన్‌ జోనల్‌ విభాగాధిపతి ఆసిఫ్‌ ఇక్బాల్‌, ఐఐఎంఆర్‌ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, అంకుర వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో ఇక్రిశాట్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌గా ఇటీవల ఎంపికైన డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ భేటీ

ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ ఇటీవలనే హైదరాబాదులోని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు. మార్చిలో బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా భాద్యతలు చేపట్టనున్న డా.పాఠక్‌ను, ఉపకులపతి జానయ్య ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే కాలంలో ఇక్రిశాట్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచి నూనె గింజలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంటల సాగు పెంపొందించేందుకు తగు సాంకేతిక సహాయాన్ని అందించాలని జానయ్య కోరారు. దీనికి డాక్టర్‌ పాఠక్‌ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపకులపతి జానయ్య,డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌లు ఐసిఏఆర్‌ లో ఏ.ఆర్‌.ఎస్‌ లో తాము ఇద్దరూ బ్యాచ్‌మేట్‌ లు కావడం మరియు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన స్థానంలో సహ శాస్త్రవేత్తలుగా పని చేసిన వారు కావడంతో కలిసి పని చేసిన ఆనాటి రోజులను,అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read More

చిరుధాన్యాలకు చిరునామా దక్షిణ భారత్‌ పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న సాగుసంపూర్ణ ఆహార భద్రతకు ఊతం ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడి

చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్‌ స్వామినాథన్‌ పరిశోధన సంస్థ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళలలో వీటి సాగు భారీగా పెరుగుతోందని, వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణతో కూడిన నవీన సాగు విధానాలు, అధిక దిగుబడులకు అనుకూలతలు, ఆధునాతన శుద్ధి, మెరుగైన మార్కెటింగ్‌ మార్గాలు వీటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది. ఈ పంటలను ప్రోత్సహిస్తే ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైనట్లు తెలిపింది. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో సంస్థ అధ్యయనం నిర్వహించి ''చిరుధాన్యాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. దక్షిణ భారత అధ్యయనం నుంచి పాఠాలు'' పేరిట తాజాగా నివేదికను విడుదల చేసింది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ అధ్యయనంలో అలివర్‌కింగ్‌, భారతీయ గణాంకసంస్థ ఆర్ధిక విశ్లేషణ విభాగ ''శాఖాధిపతి మధురస్వామినాథన్‌, ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ శాస్త్రవేత్త పి. పి.యువరాజ్‌, పోషకాహార శాస్త్రవేత్త డీజే నిత్యల బృందం పాల్గొంది. దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, సాగు పునరుజ్జీవం, రైతులకు ఆదాయం పెంపు వంటి అంశాలపై తమ నివేదికను తాజాగా వెల్లడించింది. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలోని కె.హిల్స్‌ బ్లాక్‌ కేంద్రంలో అధ్యయనాంశాలను వెల్లడించింది. 

స్థితిగతులు ఇలా..
దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 200 మిలియన్‌ టన్నులు కాగా.. అందులో చిరుధాన్యాల ఉత్పత్తి 20 మిలియన్‌ టన్నుల కంటే తక్కువగా ఉంది. దేశంలో చిరుధాన్యాలకు ప్రస్తుత నికర రాబడి హెక్టారుకు దాదాపు రూ.10,000 మాత్రమే. కందగడ్డను పండించడం ద్వారా హెక్టారుకు రూ.25 వేలు వస్తోంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ గణాంకాలను అనుసరించి ఆహారధాన్యాల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. 2011-15 సంవత్సరాలలో వరికి వెచ్చించిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయం 224 శాతం, గోధుమలకు 304 శాతం కాగా, చిరుధాన్యాలకు 100 శాతమే ఉంది.

ఆరోగ్యసిరి ధాన్యాలు
అత్యధిక పోషక విలువలకు చిరుధాన్యాలు పేరు పొందాయి. వాటిలో ప్రొటీన్‌, డైటరీ ఫైబర్‌, సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కరవు నిరోధక పంటలు. తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. వీటిని బంజరుభూముల్లోనూ సాగు చేయవచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019- 21)లో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల స్థాయి స్వల్పంగా తగ్గింది. బరువు తగ్గుతున్న వారి శాతం 38 నుంచి 36కి, తక్కువ బరువు ఉన్నవారి శాతం 21 నుంచి 19కి తగ్గింది. 6 నుంచి 59 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో రక్తహీనత 59 నుంచి 67 శాతానికి పెరిగింది. మహిళల్లో ఊబకాయం 21 నుంచి 24 శాతానికి, పురుషులలో 19 నుంచి 23 శాతానికి హెచ్చింది. ఈ సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారం చూపగలవు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జొన్న ఆధారిత ఉత్పత్తులను, పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంలోనూ ప్రయోగాత్మకంగా చేర్చింది.

కె. హిల్స్‌లో ఏం జరిగింది
చిరుధాన్యాల ఉత్పత్తిలో తమిళనాడు 7వ స్థానంలో ఉంది. మిల్లెట్‌ పంటల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి, చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 1990 నుంచి తమిళనాడులోని కె.హిల్స్‌ ప్రాంతంలో సాగును ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని చిరుధాన్యాల పరిశోధన సంస్థ, ఇక్రిశాట్‌ తదితర సంస్థల సహకారంతో వనరుల పరిరక్షణ, సాగు, వినియోగం, వాణిజ్యంపై దృష్టి సారించింది. కొత్త వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన విత్తనాలు, ఆవిష్కరణలు, ఆధునిక శుద్ధి, విలువ ఆధారిత విధానాలపై శిక్షణ ఇచ్చింది. మెరుగైన రకాలతో విత్తన బ్యాంకును ఏర్పాటుచేసింది. పంటల సాగు కోసం ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసింది. ఫలితంగా ఇక్కడ సాగు పెరిగింది.

ఇదీ అధ్యయనం…
కె.హిల్స్‌లో స్వామినాథన్‌ పరిశోధన సంస్థ చేయూతతో జరిగిన మార్పులపై తాజాగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం ప్రతి ఇంటికి 0.15 హెక్టార్ల భూమిలో జొన్నలు సాగు చేశారు. హెక్టారుకు 1157 కిలోలు దిగుబడి వచ్చింది చిన్నకమతాలు గల సాగుదారులకు ఆధికాదాయం సమకూరింది. చిరుధాన్యాల సాగుకు హెక్టారుకు రూ.11,644 ఖర్చు కాగా.. రూ. 16,868 ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి గ్రామంలో అన్ని కుటుంబాలు నెలకు 9 రోజుల చొప్పున చిరుధాన్యాలను తింటున్నాయి. 46 శాతం మంది సగటున నెలలో ప్రతి మూడు రోజులకోసారి చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. 42 శాతం మంది నెలకు రెండుసార్లు వాటిని భుజిస్తున్నారు. పండించిన చిరుధాన్యాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక విధానాలు చేపట్టారు. చిన్న పిండిమిల్లులు అందుబాటులోకి వచ్చాయి. కె. హిల్స్‌ ఆగ్రో డైవర్సిటీ కన్జర్వర్స్‌ ఫెడరేషన్‌ పేరిట 92 గ్రామాల్లోని 109 స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. వాటితో వివిధ ఆహార పదార్థాలను తయారుచేసి ‘కొల్లి హిల్స్‌ నేచురల్‌ ఫుడ్‌ బ్రాండ్‌’ పేరిట తమిళనాడులోని 12 జిల్లాల్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల శుద్ధి యంత్రాలను ఉపయోగించడంపై శిక్షణ పొందిన తర్వాత తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని హిల్స్‌లోని ఎట్టడిపరై గ్రామ మహిళ పూంగోడి తెలిపారు. 2020కి ముందు నామక్కల్‌ జిల్లాలో బరువు తక్కువగా ఉన్న పిల్లల నిష్పత్తి 39 శాతం కాగా చిరుధాన్యాల ఉత్పత్తులను భుజించడం వల్ల ఆ నిష్పత్తి 18 శాతానికి తగ్గింది.

నివేదికలో సిఫార్సులు

  • దిగుబడే కాకుండా మిల్లెట్‌ సాగు ద్వారా రాబడిని పెంచడానికి చర్యలు చేపట్టాలి.
  • చిరుదాన్యాల శుద్ధి వల్ల మహిళలకు వంటింట్లో పనిభారం తగ్గుతుంది.
  • రైతు నేతృత్వంలోని మార్కెటింగ్‌ సమాఖ్య వంటి కొత్త సంస్థలను నెలకొల్పాలి.
  • ప్రభుత్వ సంస్థల ‘మధ్య సమన్వయం, భాగ స్వామ్యాలు అవసరం.
  • జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజనం, ఇతర పోషక కార్యక్రమాల్లో చిరుధాన్యాలను అందించాలి.

చిరుధాన్యాలకు భారీగా ప్రోత్సాహకాలుండాలి
-ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌, భారతీయ గణాంక సంస్థ ఆర్థిక విశ్లేషణ విభాగం శాఖాధిపతి
చిరుదాన్యాలు వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాయి. కొత్త వ్యవసాయ పద్ధతులతో మంచి నాణ్యమైన విత్తనాల లభ్యత ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. మెరుగైన శుద్ధి సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల లభ్యత వల్ల చిరుదాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు అధిక ఆదాయాలు కూడా పెరిగాయి. దక్షిణ భారతదేశంలోని ఈ అధ్యయనాన్ని ప్రాతిపదికగా తీసుకొని చిరుధాన్యాల సాగును పెద్దఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పెంపకందారులకు భారీగా ప్రోత్సాహకాలుండాలి. పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు భారీగా నిధులందించాలి. లాభదాయక ధరలు, నమ్మకమైన మార్కెటింగ్‌ మార్గాలుండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిరుధాన్యాల పంటలకు ధర మద్దతు లభించేలా చర్యలుండాలి.

Read More

చిరుధాన్యాల సాగు, వినియోగం భారీగా పెరగాలి

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్‌ఏవో నివేదిక

ఆకలి, పోషకాహార లోపం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య ప్రభావం, ఆహారభద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు... చిరుధాన్యాల సాగు, వినియోగం పెద్దఎత్తున విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. ఈ మేరకు సాగు మరింతగా అభివృద్ధి చెందాలని, విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని, కొత్త వంగడాలకు రూపకల్పన చేయాలని పేర్కొంది. ఉత్పత్తుల మార్కెటింగ్‌ మరింత విస్తృతం కావాలని సూచించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రాముఖ్యంపై తాజాగా ఎఫ్‌ఏవో నివేదికను విడుదల చేసింది. వివిధ దేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం తదితర అంశాలపై చేపట్టిన అధ్యయనం... నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం నివేదికను రూపొందించింది. నివేదికలో చిరుధాన్యాల సాగు, వినియోగం విస్తృతికి పలు సిఫార్సులు చేసింది. ముఖ్యాంశలివీ..
  • బాల్యం నుంచే పిల్లలకు చిరుధాన్యాల ఆహారం అందించాలి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ప్రవేశపెట్టాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు బలమైన ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు మారాలి.
  • జన్యువైవిధ్యంతోపాటు సాంకేతికతను మెరుగు పరిచి విజ్ఞానమార్పిడి జరగాలి. స్థానిక సంస్థలు, రైతులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
  • జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు చేపట్టాలి. విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రైతులు తమకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఉత్పత్తికి సమీకృత పంటల విధానం అనుసరిణీయం.
  • చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలిస్తాయి. సంప్రదాయ ఆహారంతో పోలిస్తే వైవిధ్య, స్థితిస్థాపకంగా ఉండే చిరుధాన్యాలు రైతుల జీవనోపాధిని నిలబెట్టాలి. దీనికోసం స్థిరమైన విత్తన పరిరక్షణను బలోపేతం చేయాలి. చిన్న కమతాల రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నందున వారికి చేయూతనివ్వాలి. నీటి పొదుపు ద్వారా సాగు సజావుగా సాగే ప్రణాళిక ఉండాలి. నేరుగా వంగడాలను రూపొందించడంతో పాటు కలుపు తీయడం, కోత, నిల్వ, ఉత్పత్తుల శుద్ధి శిక్షణకు సులభతర అవకాశాలను కల్పించాలి.
    మరింతగా మార్కెటింగ్‌…
  • స్థిరమైన ఉత్పత్తి, యాంత్రీకరణతోపాటు రైతులకు పంటలు లాభదాయకంగా మారేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. పంట శుద్ధి అనంతరం పిండి, రవ్వ, ఇతర పదార్థాలుగా మార్చి ప్యాకేజింగ్‌ ద్వారా పంపిణీ జరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వారాంతపు సంతల్లోనూతత… సూపర్‌ మార్కెట్లు, కిరణా దుకాణాల్లోనూ విక్రయాలు సాగాలి.
  • ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఇళ్లకే నేరుగా సరఫరా చేయడం ద్వారా విక్రయాలు సులభతరం చేయాలి.
  • చిరుధాన్యాల ఉత్పత్తి ప్రదర్శనలు నిర్వహించాలి. యాంత్రీకరణ, ఆహారశుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వాలి.

ఉత్పత్తిలో మేటి భారత్‌
చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్‌, దేశంలో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని చిరుధాన్యాలు సాగవుతాయి. తరి, ఖుష్కి, భూముల్లోనూ పెరుగుతాయి. చీడపీడలను సమర్ధంగా ఎదుర్కొంటాయి. నీటి వినియోగం తక్కువ. వీటి సాగువల్ల నేల సాంద్రత పెరుగుతుంది. పోషకాల పరంగా చిరుధాన్యాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమకూరుతాయి. పూర్వకాలం నుంచి చిరుధాన్యాల సాగు, వినియోగం జరుగుతోంది. ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దక్షిణాసియా, సబ్‌సహారా ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువ వినియోగమవుతున్నాయి. భారత్‌, నైజీరియా, నైగర్‌, చైనా, మాలి చిరుధాన్యాల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

Read More

మరచిపోయిన మంచి ఆహారాన్ని పునరుద్ధరిద్దాం

డా|| ఖాదర్‌ వలి, ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత

ప్రపంచ వ్యవసాయ రంగంలో ఇబ్బందులు

ప్రపంచ వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడింది. ఒక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయరంగం విధ్వంసానికి గురైంది. కార్పొరేట్‌ ఫుడ్‌ కంపెనీల ద్వారా బియ్యం మరియు గోధుమల వినియోగాన్ని నిరంతరం ప్రోత్సహిస్తుంది. దానికి తోడు శాస్త్రీయంగా అర్థంలేని చక్కెర మరియు చక్కెరలకు సంబంధించిన ఆహారాలను స్టేపుల్‌ ఫుడ్స్‌గా ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిణామం ప్రజలు మంచి పోషకాలు గలిగిన చిరుధాన్యాలను పక్కకు నెట్టి సక్రమమైన పోషకాలు లేని ఆహారాల ఎంపికకు దారి తీస్తుంది. గత మూడు థాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్యరంగంలో జరుగుతున్న విపరీత పరిణామాలు, ఇబ్బందికర పోకడలు మా దృష్టిని అటువైపు మళ్ళించి పరిష్కార మార్గాలకు మమ్ములను ప్రేరేపించాయి.

ఆహార భద్రత కోసం మిల్లెట్ల సంభావ్యత

వ్యవసాయ విధ్వంసం మరియు ఆహార అసమతుల్యత నేపథ్యంలో, సుస్థిర ఆహార భద్రత కోసం చిరుధాన్యాలు ఒక ఆశాదీపంగా ఉద్భవించాయి. వాటి పర్యావరణ హిత మరియు పోషక సామర్థ్యంలో సాటిలేని, చిన్న మిల్లెట్లు కిలోగ్రాముకు 200 లీటర్ల నీటిని మాత్రమే డిమాండ్‌ చేస్తాయి. బియ్యానికి అవసరమైన 8000 లీటర్ల అధికంతో పోలిస్తే అదే ఉత్పత్తికి 40 రెట్లు తక్కువ నీటి వినియోగం అవసరం పడుతుంది. అంతేకాకుండా, మైనర్‌ మిల్లెట్లకు ఆకలిని తీర్చే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది, అదే పరిమాణంలో ఉన్న బియ్యంతో పోల్చితే ఒక కిలోగ్రాము మిల్లెట్ల ఆహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. మిల్లెట్లు బంజరు భూముల్లో కూడా పండగలవు, బహుళ ఆనకట్టల నిర్మాణం లేదా సహజ పర్యావరణ వ్యవస్థలను తారుమారు చేయాల్సిన అవసరం లేని వాటిని నిజమైన ప్రపంచ పంటగా మారుస్తాయి.

సిరిధాన్యం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

సిరిధాన్యాలు పర్యావరణ ప్రయోజనాలకు మించి, అపారమైన ఆరోగ్య సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. కోడో, ఫాక్స్‌టైల్‌తో సహా – ఐదు చిన్న మిల్లెట్‌లను సిరిధాన్యాలు అని పిలుస్తారు. బార్న్‌యార్డ్‌, బ్రౌన్‌టాప్‌, మరియు లిటిల్‌ మిల్లెట్‌లు – అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శిస్తాయి. వీటి తక్కువ కార్బోహైడ్రేట్‌-టు-ఫైబర్‌ నిష్పత్తి సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు అనేక వ్యాధులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి కనుగొనబడింది. 1997 నుండి, మేము దీనిని ప్రధాన ఆహారంగా ఉపయోగించడం కోసం ప్రచారం చేసాము, ఈ చిన్న మిల్లెట్లు తీసుకురాగల గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూసాము. సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని విస్తృతంగా స్వీకరించడం ప్రజారోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగలదు. చివరకు ఆరోగ్య సంరక్షణ వ్యయంలో గణనీయమైన తగ్గింపుకు దారితీసింది.

అధిక మైనర్‌ మిల్లెట్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడం

మిల్లెట్ల సామర్థ్యాన్ని గ్రహించడం. ఆహారం మరియు పోషకాహార భద్రత కోసం. వాటి ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం అవసరం. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఆకర్షణీయమైన ధరలు మరియు విజయవంతమైన పంట దిగుబడితో ప్రోత్సహించబడిన చిన్న మిల్లెట్‌ ఫార్మింగ్‌ను రైతులు స్వీకరించడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం మిల్లెట్ల పోషకాలను గుర్తించి, ప్రపంచ మిల్లెట్‌ ప్రచారానికి కూడా నాయకత్వం వహించింది. ఇప్పటికీ ఈ ప్రయాణం సులభం కాదు. కొత్త పంటల వ్యూహాలను అవలంబించేలా రైతులను ఒప్పించడం మరియు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని నగరవాసులను ప్రోత్సహించడానికి గణనీయమైన కృషి అవసరం. అయినప్పటికీ, ఈ రోజు మనం చూస్తున్న విజయాలు మన వ్యవసాయాన్ని కాపాడటంలో మరియు సమిష్టి బాధ్యత యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి. 

మిల్లెట్ల వినియోగం, పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించడం

మిల్లెట్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం, వాటి వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సమగ్ర వ్యూహం అవసరం. ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్న పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రయత్నం చాలా కీలకం. రెసిడెన్షియల్‌ కోర్సులను నిర్వహించి మరియు ప్రత్యేకంగా మిల్లెట్‌ ఆధారిత భోజనాన్ని అందించే వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాము. అటువంటి ఆహారం తీసుకున్న 10 నుండి 15 రోజులలో, ప్రజలు గుర్తించదగిన ఆరోగ్య మెరుగుదలను అనుభవించవచ్చు. ఈ ఫస్ట్‌హ్యాండ్‌ అనుభవం డిమాండ్‌ని ఉత్ప్రేరకపరచగలదు మరియు సరఫరాను పెంచుతుంది. అయితే, ఈ మార్గం సవాళ్లు లేనిది కాదు. మిల్లెట్‌లను కార్పొరేట్‌ వ్యవసాయ సంస్థలు క్రమపద్ధతిలో పక్కకు నెట్టి, ప్రతికూలంగా ‘ముతక ధాన్యాలు’గా చిత్రీకరించాయి. దీనిని ఎదుర్కోవడానికి, ఆహార భద్రత, ఆరోగ్య మెరుగుదల మరియు పర్యావరణ పునరుద్ధరణను మిళితం చేసే పర్యావరణ నమూనాను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మిల్లెట్‌లను, వాటికి అవసరమైన వ్యవసాయ పద్ధతులను స్వీకరించడం ద్వారా, ప్రస్తుత వ్యవసాయ ఆహార పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు.

మిల్లెట్‌ ప్రమోషన్‌ కోసం విద్య, పరిశోధన

మిల్లెట్‌ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం (స్త్రం| కానీ వ్యూహాత్మక విద్యా కార్యక్రమాలు మరియు అంకితమైన పరిశోధనా సంస్థలు) నుండి బలమైన విధాన మద్దతు అవసరం. విధాన నిర్ణేతలు ఆహార సార్వభౌమాధికారం మరియు భద్రతను నిలబెట్టడానికి పరిశోధనా సంస్థలకు మార్గనిర్దేశం చేయాలి.

  • మొదటగా: ప్రభుత్వం మిల్లెట్‌ ఆహారాలను వస్తు సేవల పన్ను (స్త్రఐఊ) నుండి మినహాయించడాన్ని పరిగణించాలి. ఇది మిల్లెట్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది, ఈ పోషకాలు అధికంగా ఉండే గింజలను ప్రజలకు మరింత సరసమైనవిగా చేస్తుంది.
  • రెండవది: ప్రస్తుతం రసాయన ఎరువుల కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలను చిరుధాన్య రైతుల వైపు మళ్లించాలి. ఈ ఆర్థిక దారి మళ్లింపు రైతులు మిల్లెట్‌ సాగుకు మారడానికి, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
  • మూడవదిగా: వర్షాధార వ్యవసాయం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ నిర్దిష్ట పరిశోధన మరియు అభివృద్ధి అవసరాలను మిల్లెట్‌ వంటి పంటలకు పరిష్కరించగలదు ఈ ప్రత్యేక దృష్టి స్థిరమైన మిల్లెట్‌ వ్యవసాయ పద్ధతులలో పురోగతిని రేకెత్తిస్తుంది.
  • నాల్గవది: ప్రభుత్వ సంస్థలు మిల్లెట్‌ ఆధారిత భోజనాన్ని అందించాలి, మిల్లెట్‌ను ఆహారంగా ఉపయోగించే సంస్కృతిని పెంపొందించాలి. ఈ ఆదేశం పెద్ద ప్రైవేట్‌ సంస్థలు, ఆర్మీకి విస్తరించాలి. పారామిలిటరీ బలగాలు మరియు పోలీసు విభాగాలును కూడా విస్తరించాలి.
  • ఐదవది: మిల్లెట్‌లను ప్రోత్సహించడం పాఠశాలల్లో ప్రారంభించాలి, మిల్లెట్‌లను మధ్యాహ్న భోజనంలో చేర్చడం ద్వారా ఈ పోషకమైన ధాన్యం వైపు క్రమంగా ఆహార మార్పును సులభతరం చేస్తుంది.
  • ఆరవది: మిల్లెట్‌ రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉత్పత్తిని ప్రేరేపించగలవు మరియు మిల్లెట్‌ సాగుకు మారే వారికి ఆదాయ స్థిరత్వాన్ని అందించగలవు.

ఈ విధాన మార్పులతో పాటు, పరిశోధన మరియు విద్యపై బలమైన దృష్టి పెట్టాలి. మిల్లెట్లను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలు అమూల్యమైనవి. అధునాతన అభివృద్ధి కోసం. స్థిరమైన మిల్లెట్‌ వ్యవసాయ పద్ధతులు మరియు వాటి పోషక ప్రయోజనాలను మరింత నిశితంగా అధ్యయనం చేయడం కోసం చాలా అవసరం.

పైగా మిల్లెట్ల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ప్రయోజనాలను పాఠశాల మరియు కళాశాల స్థాయిలలో విద్యా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి. విద్యార్థులు వివిధ రకాల ధాన్యాలు, వాటి పోషకాల గురించి తెలుసుకోవాలి. మరియు పర్యావరణ స్థిరత్వంపై వాటి ప్రభావం తెలుసుకోవాలి. ఈ జ్ఞానం కొత్త తరం సమాచారం కలిగిన వినియోగదారులను మరియు మిల్లెట్ల పట్ల మక్కువగల వారిని ప్రోత్సహిస్తుంది.

అయితే, ఈ మార్పులను ప్రారంభించడంలో ప్రభుత్వం గణనీయమైన పాత్ర పోషిస్తుండగా, ఈ ప్రయత్నాల విజయం ప్రజల ఆమోదం మరియు మద్దతుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, విధాన మార్పులు మరియు విద్యా కార్యక్రమాలతో పాటు, మిల్లెట్ల ప్రయోజనాలను ప్రోత్సహించే ప్రజా చైతన్య ప్రచారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. విధానం, విద్య, ప్రజల అవగాహన మధ్య సహకారం అందరికీ ఆరోగ్యకరమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దారితీస్తుంది. 

Read More