ధాన్యం తడిస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే బాధ్యత

తెలంగాణాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌ మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు, నిర్వహణ, రవాణా, లెక్కల నమోదులో అనుసరించాల్సిన నియమ నిబంధనల్ని స్పష్టం చేస్తూ జిల్లాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కౌలు రైతులు తాము సాగుచేసిన భూమి వివరాల్ని ముందుగానే వ్యవసాయశాఖ ఓపీఎంఎస్‌ లాగిన్‌లో కౌలు రైతు కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశంలో రవాణాకు అనుకూలంగా ఉండాలి. సెంటర్లో ధాన్యం తడిస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
సన్న ధాన్యం నింపే బస్తాలను గుర్తించేందుకు వీలుగా ఎర్రదారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను ఆకుపచ్చ దారంతో కుట్టాలి. సన్నధాన్యం బస్తాలపై ‘ఎస్‌’ అనే అక్షరం రాయాలి.
రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 17% మించొద్దు. చెత్త, తాలు 1%, మట్టిపెళ్లలు, రాళ్లు 1%, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం 5%, పూర్తిగా తయారుకాని ధాన్యం 3% దాటొద్దు.
ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు మిల్లుకు పంపించాలి. ధాన్యం రవాణా చేసే ముందే ఓపీఎంఎస్‌ లో వివరాల్ని పీపీసీ సెంటర్‌ నిర్వాహకులు నమోదుచేయాలి.

  • దళారులు ధాన్యంకొంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై చర్యలుంటాయి.
Read More

‘ఈ-పంట’ నమోదు సక్రమంగా జరగాలి

ఈ-పంట డిజిటల్‌ సర్వేలో.. విస్తీర్ణం, పంటలు సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 2025 ఖరీఫ్‌ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూముల్ని తొలగించి.. సాగుకు అనుకూలమైన వాటి వివరాలనే ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో జరిగే డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు అనుసంధానించామని పేర్కొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి కాదని వివరించారు.

Read More