ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం

కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 3 ఎకరాల్లో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ), ఐదు ఎకరాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కొబ్బరి పరిశ్రమ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల కోసం రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం నియోజక వర్గంలోని మామిడికుదురు మండలంలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కొబ్బరికాయల తొక్క వొలిచి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పంపుతున్నారు. కోనసీమలో కొబ్బరి ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడమే కారణం. దీనిపై అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టాలి. నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించే అవకాశముంది. ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఎంతో ఉపయోగం’ అని మంత్రి పేర్కొన్నారు.

Read More

వెయ్యి కాయలకు రూ.24 వేలు పలికిన పచ్చి కొబ్బరి కాయలు

మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చి కాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుంది. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎక రాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.

Read More