అమరావతిలో పురుగుమందులు లేని ఆహారం అందేలా చూస్తాం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయకుమార్‌ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.

Read More

అమరావతిలో అంతర్జాతీయ గార్డెన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధుల ఆసక్తి

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గార్డెన్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్‌ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. విజయవాడలోని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి. లక్ష్మీపార్థసారథితో ఇజ్రాయెల్‌ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. శీతోష్ణస్థితిని బట్టి పెంచగలిగే వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు తదితరాల గురించి దృశ్య మాధ్యమం ద్వారా వివరించారు. వారి సొంత నర్సరీల్లో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సమావేశానికి తీసుకొచ్చారు. తమ ప్రతిపాదనలను సీఎండీకి వివరించారు. సమావేశంలో గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఇజ్రాయెల్‌ ప్రతినిధులు డేవిడ్‌ మిజ్రహి, ప్రశాంత్‌, కిషోర్‌, ఏడీసీ హార్టీకల్చర్‌ విభాగాధిపతి వి. ధర్మజ, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌ అధికారులు పి.సురేష్‌ బాబు, కె.వి. గణేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More