2026-27 విద్యా సంవత్సరానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎ. మణి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్ సైట్ *www.angrau.ac.in* ని చూడాలన్నారు.