హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన బిన్వంత్ సింగ్కు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సొంతూరిపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగం వదులుకొని 2003లో స్వగ్రామానికి వచ్చేశారు. వ్యవసాయంలో ఏముంది అని తండ్రి వారించినా.. చైనా, జపాన్ వంటి దేశాల్లో అధ్యయనం చేసి మరీ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడప్పుడే భారత్లో విస్తరిస్తున్న మెక్ డొనాల్డ్స్ కంపెనీకి ‘ఐస్బర్గ్ లెట్యూస్’ అనే సలాడ్ ఆకుకూర అవసరమని గ్రహించి, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఆకులను సలాడ్లు, శాండ్విచ్లు, బర్గర్లలో విరివిగా వాడుతారు. 80 ఎకరాల్లో ఈ ఆకుకూరను సాగు చేస్తున్నారు. పొలంలో ఏర్పాటుచేసిన వ్యాక్యూమ్ ప్రీ కూలింగ్ సదుపాయంతో కోసిన 20 నిమిషాల్లోనే ఆకు కూరల ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరి పాడవకుండా తాజాగా ఉంటాయి. ఈ సాగుతో 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.

12 Jan, 2026
