అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరిగిన రాష్ట్రీయ కృషి ప్రగతి ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ ఉద్యానశాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అందులో కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను వివరిస్తూ రాష్ట్ర ఉద్యానశాఖ స్టాల్ను ఏర్పాటు చేసింది. ప్రదర్శన చివరి రోజు ప్రథమ బహుమతికి ఎంపిక చేసి, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ రాష్ట్ర ఉద్యాన అధికారులకు జ్ఞాపికను బహూకరించారు.

3 Nov, 2025
