తిరుపతి జిల్లా కోనేటిరాజుపాళెం సమీపంలో ఎమ్మెస్‌ నయారా ఎనర్జీ లిమిటెడ్‌ గ్రేస్‌ డిస్టిలరీ కంపెనీ. రూ.581.88 కోట్లతో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 13న ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు. పారిశ్రామిక వాడలో ఇది రెండో ఇథనాల్‌ పరిశ్రమ కానుంది. పెట్రోలుపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ఈ-20 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. స్థానికంగా ఉన్న వరి, జొన్న, సజ్జ, గోధుమలు, చెరకు పిప్పి ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసి 50 శాతం పెట్రోలు భారం తగ్గించాలన్నదే కేంద్రం లక్ష్యంగా మారింది.