భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల టన్నులకు కేంద్రం పెంచిందని ఎఫ్‌సీఐ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్‌, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. విజయవాడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో సోమవారం ఆయన ధాన్యం సేకరణ, నిల్వ, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ.. ”గతేడాది రబీలో రాష్ట్రంలో 9.33 లక్షల టన్నుల బియ్యం సేకరిం చారు. ఈ ఏడాది మరింత పెరుగుతుంది. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, గోదాములు నిర్మించేందుకు ఎఫ్‌సీఐ సంసిద్ధత తెలిపింది. ఈ గోదాముల్లో 45 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్యానెల్స్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఎఫ్‌సీఐ ద్వారా ప్రతి నెల 1.54 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ అవుతోంది” అని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గోదాముల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎఫీసీఐ జీఎం విజయ్‌కుమార్‌ యాదవ్‌, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.