భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) కొత్తగా రూపొందించిన పూస శనగ- 4037 రకానికి తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్‌ అశ్విని పేరు పెట్టింది. ఖమ్మం జిల్లా గంగారంతండాకు చెందిన అశ్విని ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపుర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు. సెమినార్‌లో పాల్గొనేందుకు గతేడాది సెప్టెంబరులో తండ్రితో కలిసి కారులో వెళ్తూ మహబూబాబాద్‌ జిల్లా ఆకేరు వాగు సమీపంలో వరద ప్రవాహంలో మునిగి మరణించారు.