రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి రావడంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వెంటనే కొనుగోళ్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు అందరు గరిష్ట మద్ధతు ధర పొందేందుకు వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా సీసీఐ సెంటర్లలో రైతుల ఆధార్ ప్రామాణికత సమస్య వలన నిలిచిపోయిన పత్తి కొనుగోళ్ల ప్రక్రియను, వెంటనే పునరుద్ధరించి పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు మంత్రి తుమ్మల లేఖ రాయడం జరిగింది.
అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మిర్చి ధరలు తగ్గడంతో రాష్ట్రంలో మిర్చి రైతులు ఆందోళనలో ఉన్నారని, రాష్ట్రంలోని మిర్చి రైతుల శ్రేయస్సు కోసం శ్రీజుఓజూఈ ద్వారా మార్కెట్ ధరకు ఎండుమిర్చిని కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు మంత్రి తుమ్మల లేఖ రాశారు.

