రైతులకు పశువైద్యాధికారి సూచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం, కొవ్వూరు మండలాల పరిధిలో 20 ఫారాల్లో సుమారు 40 వేల కోళ్లు వైరస్తో మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. పశువైద్య అధికారులు గ్రామాల్లో పర్యటించి మృతి చెందిన కోళ్లను బయటకు తీసుకురాకుండా ఫారం పరిధిలోనే పూడ్పించారు. కోళ్ల ఫారాల వద్ద బ్లీచింగ్, రసాయనాలు చల్లి పరిశుభ్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించినట్లు జిల్లా పశువైద్యాధికారి టి. శ్రీనివాసరావు తెలిపారు. 40 కోళ్ల నమూనాలను భోపాల్లోని ప్రయోగశాలకు పంపించామన్నారు.

6 Feb, 2025
