వాతావరణ మార్పులను తట్టుకుని అత్యధిక దిగుబడులనిచ్చే 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోది ఆదివారం విడుదల చేశారు. వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచే ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని పూసా క్యాంపస్లో వీటిని ఆవిష్కరించిన మోదీ… అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ కొత్తవంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పౌష్టికాహారం వైపు ప్రజలు మల్లుతున్నారనే విషయాన్ని తెలియచేశారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను, సహజ వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా పధాని మాట్లాడారు.

12 Aug, 2024
