ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. డిసెంబరు 5న ఈ ఎన్నికలకు సంంధించి నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. తుపాను, ఇతర ఇబ్బందుల వల్ల జిల్లాల్లో పరిస్థితులు ఎన్నికలకు సానుకూలంగా లేవనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయవద్దని జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి షెడ్యూలును ప్రభుత్వం మళ్లీ విడుదల చేస్తుంది.