ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌లో జల వనరుల కూటమికి పెద్దపీట వేసింది. భారీ, మధ్యతరహా, చిన్న నీటి పారుదలకు 13,308.50 కోట్లు పెట్టుబడిగా వ్యయంగా కేటాయించి నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది. తాజా కేటాయింపుల్లో పోలవరం నిధులు కూడా కలిపి ఉంటాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తిపోతల నీటిని మళ్లించేందుకు ఆ కాలువ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.