జాతీయ సహజ వ్యవసాయ పథకం (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) విధానంలో పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసేందుకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు గ్రాంట్లను ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రకృతి వ్యవసాయం రైతులు, గుర్తింపు పొందిన పరిశోధన సంస్థలు జూన్‌ 5న సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://nmnfresearch.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.