వ్యవసాయరంగ అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలతో ముందకువచ్చే వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశాఖ నగరంలో సోమవారం ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో దేవేశ్‌ చతుర్వేది మాట్లాడుతూ రాష్ట్రాలు చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సహకారం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభత్వం పెద్దపీట వేస్తోందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల, పుదుచ్చేరి నుంచి వ్యవసాయరంగ నిపుణులు, అధికారులు సదస్సుకు హాజరయ్యారు.