తన విశ్రాంత జీవితంలో వేదాలు, ఉపనిషత్తులు చదవడంతోపాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘ప్రకృతి వ్యవసాయం శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది’ అని పేర్కొన్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సహకారశాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినప్పుడు.. హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని నేను భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని రైతులు, పేదలు, గ్రామాలు, పశు సంపద కోసం పని చేస్తుంది’ అని అమిత్‌ షా వివరించారు.