జాతీయ లైవ్ స్టాక్ మిషన్ కింద యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతో లబ్ధి కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు పేర్కొన్నారు. జాతీయ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా 50% రాయితీపై గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు, పందులు, సైలేజి యూనిట్ల ఏర్పాటుకు రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు పశు సంవర్ధకశాఖ మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న 20 మంది రైతులను కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ నెల 13న పుణెలో సత్కరించారు. ఈ గౌరవం పొందిన పశ్చిమగోదావరి జిల్లా బాదరాలకు చెందిన మిరియాల రామకుమార్ (కోళ్ల పెంపకం), ప్రకాశం జిల్లా కొత్తూరుకు చెందిన నారు బసివి రెడ్డి (గొర్రెల పెంపకం) గురువారం దామోదర్ నాయుడిని కలిశారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.

17 Jan, 2025
