ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం ప్రపంచానికే ఆదర్శం అని రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్య కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుల్బెంకియన్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పంటల బీమాకు సంబంధించి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ ద్వారా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

17 Jul, 2024
