నాగార్జున సాగర్‌ డ్యాం మొత్తం 26 క్రస్ట్‌ గేట్లనూ గురువారం ఎత్తేశారు. అన్ని గేట్ల నుండి 2,23,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ సమయంలో ఎగువ నుంచి 2,53,534 క్యూసెక్కుల నీరు వస్తుంది. నాగార్జున సాగర్‌ జలాశయ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా… గురువారానికి 585.30 అడుగులుగా ఉంది. 2022 ఆగస్టులో చివరిసారిగా 26 గేట్లను ఎత్తారు. మరలా సుమారు రెండు సంవత్సరాల తరువాత నిన్న మొత్తం గేట్లను ఎత్తడం జరిగిందని నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఈఈ మల్లిఖార్జునరావు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండడంతో బ్యారేజ్‌ అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి పంపుతున్నారు.