నైరుతి రుతుపవనాలు ముందుగా అంచనా వేసినట్లుగా ఈ నెల 26న కేరళను తాకకపోయినా అరేబియా సముద్ర ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో మరింత విస్తరించాయి. అరేబియాతోపాటు లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతంలోనూ మరికొంత ముందుకు కదిలాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాలి. తద్వారా దేశంలో వర్షాకాలం మొదలవ్వాలి. గత ఏడాది ఇవి మే 24నే కేరళకు వచ్చాయి. “అరేబియా సముద్రంలో ఇప్పటికే విస్తరించిన ప్రాంతాలతోపాటు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవి విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొంది. ఆగ్నేయ, ఈశాన్య బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకూ ఇవి 2-3 రోజుల్లో విస్తరిస్తాయి” అని ఐఎండీ తెలిపింది.

28 May, 2026
