రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

వెటర్నరీ వర్సిటీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 253 బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2005లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగా, ఈ స్థాయిలో నియామకాలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యక్ష నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పశుసంవర్ధక శాఖ) బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ 253 ఉద్యోగాల్లో 81 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఆచార్యులు-56, సంయుక్త ఆచార్యులు-78, సహాయ ఆచార్యులు-119 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించింది.

Read More