జులై 31వ తేదీన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం

  • రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌
    ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జులై 31న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు. 01-11-2021 నుండి 31-10-2022 కాలం మధ్య చదివి ఉత్తీర్ణులైన 153 మంది పి.జి., పిహెచ్‌డి విద్యార్థులకి, 691మంది యుజి విద్యార్థులకి పట్టాలని ఈ స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ మెరిట్‌ సాధించిన 33 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు, 14 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్‌ కార్డు మరియు డ్రెస్‌ కోడ్‌ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in లో జూలై 20వ తేదీ 2025 నుంచి అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రార్‌ వివరించారు.
Read More

విద్యార్థులతో జీవ ఎరువుల తయారీ

వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయం

బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సులో భాగంగా విద్యార్థులతో జీవఎరువు (బయోఫెర్టిలైజర్‌)ల తయారీపై శిక్షణ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. జీవ ఎరువుల ప్రాధాన్యం దృష్ట్యా ఉత్పత్తిని పెంచేందుకు పూనుకుంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులో విద్యాబోధన, సాగు క్షేత్రాల సందర్శన వంటివి ఉన్నాయి. జీవఎరువుల తయారీతో పాటు వాటి వినియోగం, నిర్వహణ, వ్యాపారంపై శిక్షణ ఇవ్వాలని భావించింది. మంగళవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జీవన ఎరువుల విశిష్టత, ప్రయోగశాలలో తయారీ, వాడే విధానాన్ని వివరించారు. ఈ సందర్బంగా అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌ మాట్లాడారు. ”ప్రస్తుతం జీవన ఎరువుల వినియోగం, లభ్యత తక్కువగా ఉన్నందున విద్యార్థులకు దీని తయారీపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. చదువు అనంతరం స్వయం ఉపాధికి ఇది దోహదపడుతుంది” అని డీన్‌ తెలిపారు.

Read More