రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు మన దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి రాబోతున్నాయి. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సమ్మిట్లో 26 విదేశీ, దేశీయ సంస్థలతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అంచనాలకు మించి, పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వంతో వివిధ కంపెనీలు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు కార్యరూపం దాల్చాక 64,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 10 లక్షల మందికి పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు: రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, ది కోక-కోలా సిస్టమ్ ఇన్ ఇండియా, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్), ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ (ఇండియా) ప్రై.లి. (లూలు గ్రూప్), నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, కార్ల్స్బర్గ్ ఇండియా ప్రై.లి., బీఎల్ అగ్రో ఇండస్ట్రీస్, ఏబీఐఎస్ ఫుడ్స్ అండ్ ప్రోటీన్స్, ఏస్ ఇంటర్నేషనల్, పతంజలి ఫుడ్స్, గోద్రేజ్ అగ్రోవెట్, అగ్రిస్టో మాసా, టివానా న్యూట్రిషన్ గ్లోబల్, హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్, ఇండియన్ పౌల్ట్రీ అలియన్స్, మిస్సెస్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాల్టీస్ లిమిటెడ్, డాబర్ ఇండియా, అల్లానా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఓలమ్ ఫుడ్ ఇన్ గ్రేడియంట్స్, ఏబీ ఇన్బెవ్, క్రెమికా ఫుడ్ పార్క్, డెయిరీ క్రాఫ్ట్, సన్ డెక్స్ బయోటెక్, నాసో ఇండస్ట్రీస్, బ్లూపైన్ ఫుడ్స్.