పశుసంవర్థకశాఖ కొత్త డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పశుపోషణ లాభదాయకంగా చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ నూతన డైరెక్టర్‌ టి. దామోదర్‌నాయుడు చెప్పారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాడి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.