పంట వేసిన రైతులకే రైతు భరోసా

పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రబీ నుండి రైతులకు రూ.7,500 ఇస్తామని మంత్రి తెలియచేసారు. పంటల బీమాకు సంబంధించి ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కూడా చెప్పారు.

Read More

దసరా రోజున రైతు భరోసా

తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Read More