చౌడును తట్టుకునే వరి విత్తనం

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది.
ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.

Read More

తుపాన్లను తట్టుకునే వరి రకం

ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు పరిశోధన కేంద్రం ఎంటీయూ 1318 రకాన్ని విడుదల చేసి 2020లో మినీ కిట్లు ఇచ్చి రైతులతో సాగుచేయించగా మంచి ఫలితాలు వచ్చాయి ఈ రకాన్ని 2022 నుంచి సాగుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తుపాన్లను తట్టుకుని దీటుగా నిలబడి మంచి దిగుబడులు ఇస్తుండటంతో గత ఖరీఫ్ లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు సుమారు 6 లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1318 రకం సాగైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం పెనికేరులో తుపానుకు పడిపోయిన స్వర్ణ రకం వరి. పక్కనే నేలవాలకుండా నిలబడిన ఎంటీయూ 1318 రకం మొంథాను తట్టుకుని…. ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వరిపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. కనీసం ఎకరాకు 15-20 బస్తాల దిగుబడికి నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని స్వర్ణ స్థానంలో ఇతర రకాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంటీయూ 1318ని.. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. మొంథా తీవ్ర అలజడి సృష్టించినా 90% పంట పడిపోకుండా నిలబడింది. రెండేళ్ల సగటును పరిశీలిస్తే ఎకరాకు 35-40 బస్తాల దిగుబడి వస్తుంది. వర్షాలకు పంట నేలవాలలేదు.
ఎకరాకు 4-5 బస్తాల అధిక దిగుబడి

  • పాలడుగు సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు, ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    మార్టేరు పరిశోధన కేంద్రంలో పనిచేసినప్పుడు ఎంటీయూ 1318ని రూపొందించా. స్వర్ణ రకాన్ని ఎంటీయూ 1064(అమర)తో సంకరపరిచి అభివృద్ధి చేసిన విత్తనమిది. 150-155 రోజుల వ్యవధిలో దిగుబడినిచ్చే ఈ రకం.. కాండం దృఢంగా ఉండటం వల్ల తుపాన్లకు నేల వాలదు. దోమపోటు, ఎండాకు, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. స్వర్ణతో పోలిస్తే ఎకరాకు 4-5 బస్తాల దిగుబడిని అదనంగా ఇస్తుంది.
Read More