జులై 31వ తేదీన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం

  • రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌
    ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని జులై 31న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ తెలిపారు. 01-11-2021 నుండి 31-10-2022 కాలం మధ్య చదివి ఉత్తీర్ణులైన 153 మంది పి.జి., పిహెచ్‌డి విద్యార్థులకి, 691మంది యుజి విద్యార్థులకి పట్టాలని ఈ స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ మెరిట్‌ సాధించిన 33 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు, 14 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు స్వర్ణ పతకాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు, అడ్మిట్‌ కార్డు మరియు డ్రెస్‌ కోడ్‌ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in లో జూలై 20వ తేదీ 2025 నుంచి అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రార్‌ వివరించారు.
Read More

ప్రపంచ మొక్కల పరిశోధకుల జాబితాలో ఐకార్‌ శాస్త్రవేత్త జూకంటి అరవింద కుమార్‌ ఎంపిక

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) శాస్త్రవేత్త జూకంటి అరవింద్‌కుమార్‌ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్‌ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్‌కుమార్‌ ఒకరు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యవసాయ విభాగాధపతి జాన్‌ పీఏ అయోడినిస్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి. 2023-24లో చేసిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నారాయణఖేడ్‌కు చెందిన అరవింద్‌కుమార్‌ 2012లో ఐకార్‌లో చేరారు 2017 నుంచి రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో ఆయన పనిచేస్తున్నారు. జాబితాలో చోటు లభించడంపై శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Read More