బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో 8

బర్డ్ ఫ్లూ స్వేచ్ఛా ప్రాంతాలు (బర్డ్ ఫ్లూ ఫ్రీ ఏరియా)గా ఆంధ్రరాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని 8 ప్రాంతాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతాల్లో ఫ్లూ ప్రబలడంతో ఆ ప్రాంతాలను అప్పట్లో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తర్వాత నెలకు రెండుసార్లు చొప్పున ఈ ప్రాంతాల్లోని కోళ్లు / పక్షుల నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐకార్-ఎనఐహెచఎసఏడీ)కు పంపించారు. వరుసగా నెగెటివ్ వస్తుండటంతో ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కమర్షియల్ పౌల్ట్రీలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక, ఎ.కోడూరు మండలంలోని కృష్ణారావుపాలెం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని 21వ వార్డు, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం మరియు బాతులు ప్రభావితమైన ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎనఆర్‌పేట, కర్నూలును బర్డ్ ఫ్లూ ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించారు.

Read More

యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More