పోలవరం ప్రాజెక్టులో నాణ్యత చాలా ముఖ్యం

ఎదురయ్యే అన్ని సమస్యలను అధిగమిస్తూ… 2028 మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేయడమే కాదు… నాణ్యత కూడా చాలా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఇటీవలవరకూ పోలవరం ఎడమకాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయని, రూ. 960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అధికారులు చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్‌సి ఎం. వెంకటేశ్వరరావు, బావర్‌, మేఘా ప్రతినిధులు, ఇంజనీరింగు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read More

పోలవరం ప్రాజెక్టు గురించి విదేశీ బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలపై నవంబరు 6 నుంచి నాలుగు రోజుల పాటు మేథోమథనం చేయనున్నారు. ప్రాజెక్టును సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్ళను పరిష్కరించడంపై నిపుణులు చర్చించనున్నారు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్‌ అంశాల్లో విశేష అనుభవం ఉన్న డేవిడ్‌ బి. పాల్‌, రిచర్డ్‌ డోన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, సీస్‌ హించ్‌బెర్గర్‌లతో కూడిన విదేశీ బృందంతో సంబంధిత అధికారులు, నిపుణులు నవంబరు 6 నుంచి 9వ తేదీ వరకు మేథోమధనం చేయనున్నారు.

Read More