కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ యోజనకు 20 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద ఈనెల 5వ తారీఖున రైతుల బ్యాంకు ఖాతాలో రూ. 2000/-లు జమ కానున్నాయి. దేశంలోని 9.5 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2000/-ల చొప్పున బదిలీ చేస్తారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడి మహారాష్ట్రలోని వాషిమ్‌ నుండి అక్టోబర్‌ 5న రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. కొత్తగా ఈ పథకంలోకి అర్హత పొందాలనుకునే రైతులు అక్టోబరు 5 లోపు బ్యాంకు ఖాతా యొక్క లి-దిగిబీ ని పూర్తి చేయడం తప్పనిసరి. లి-దిగిబీ తో పాటు పి.యం. కిసాన్‌ లబ్దిదారుడు భూమి ధృవీకరణను పొందడం కూడా అవసరం. రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్‌ కార్డుతో అనుసంధానించడం కూడా చాలా ముఖ్యం.

Read More

రైతులకు దసరా కానుక ప్రకటించిన మోదీ

రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద అక్టోబరు 5వ తేదీన నిధులను విడుదల చేయబోతుంది. అర్హులైన రైతులందరికి వారివారి ఖాతాలలోకి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ (డిబిటి) రూపంలో దీనిని కేంద్రప్రభుత్వం జమ చేయనుంది. ఈ విధానంలో లబ్దిదారులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులను జమ చేయడం వల్ల ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ అందుతుంది.

Read More